
Updated : 31 Oct 2021 11:34 IST
AP News: ఏపీ మంత్రి నుంచి ఆ శాఖ తొలగింపు..
బుగ్గనకు అదనంగా కేటాయింపు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం తొలగించింది. ఆయన్ను ఎక్సైజ్ శాఖకే పరిమితం చేసింది. కొత్తగా వాణిజ్య పన్నుల శాఖను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి కేటాయించింది. ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలను ఇప్పటివరకు బుగ్గన చూస్తుండగా ఇకపై వాణిజ్య పన్నులశాఖ బాధ్యతలూ ఆయనే పర్యవేక్షిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Tags :