
Updated : 12 Sep 2021 14:10 IST
Vizag Steel Plant: ‘ఉక్కు’ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్షాల పాదయాత్ర
విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలోని గాజువాక కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకు అఖిలపక్షాలు పాదయాత్ర నిర్వహించాయి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇవీ చదవండి
Tags :