Amarinder Singh: కాంగ్రెస్లో ఉండను.. భాజపాలోనూ చేరను..!
కెప్టెన్ అమరీందర్ భాజపాలో చేరడం లేదని.. అలాగని కాంగ్రెస్లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్
దిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కెప్టెన్ అమరీందర్.. తాను భాజపాలో చేరడం లేదని వెల్లడించారు. అలాగని కాంగ్రెస్లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలా పంజాబ్ కాంగ్రెస్లో సంక్షోభం నెలకొన్న వేళ.. తన రాజకీయ భవిష్యత్తుపై అమరీందర్ సింగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై మరింత ఆసక్తి నెలకొంది.
‘52ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఓ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నాకు ఫోన్ చేసి రాజీనామా చేయమని చెప్పారు. అయినప్పటికీ తిరిగి నేను ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. ఆరోజు సాయంత్రమే గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా చేశాను. యాభై ఏళ్ల తర్వాత నాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తనకు కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించింది. ఇప్పటివరకు నేను పార్టీకి రాజీనామా చేయనప్పటికీ నమ్మకం లేని చోట నేను కొనసాగలేను’ అని ఓ జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, భాజపాలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. భాజపాలో చేరడం లేదని వివరణ ఇచ్చారు.
ఇక నవజోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు అప్పగించడాన్ని అమరీందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయడాన్ని ప్రస్తావించిన అమరీందర్.. ఓ స్థిరమైన మనస్తత్వం లేని వ్యక్తి చేతిలో పార్టీ పగ్గాలు పెడితే ఇలాగే వ్యవహరిస్తారని అన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్తో సరిహద్దు కలిగిన పంజాబ్ చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రమని.. అటువంటప్పుడు సిద్ధూ వంటి నేతలతో దేశ భద్రతకు ముప్పేనని వ్యాఖ్యానించారు. ఇలా తాను కాంగ్రెస్లో కొనసాగనని ప్రకటించిన కొద్దిసేపటికే.. అమరీందర్ సింగ్ ట్విటర్ అకౌంట్ కూడా అప్డేట్ అయ్యింది. అంతకుముందు ట్విటర్ బయోలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా పేర్కొనగా.. తాజాగా దాన్ని తొలగించడం గమనార్హం.
ఇదిలాఉంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బుధవారం సమావేశమైన కెప్టెన్ అమరీందర్ సింగ్ గంటకుపైగా చర్చించారు. కేవలం వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర వంటి అంశాలపైనే చర్చించినట్లు వెల్లడించారు. భాజపాలో చేరే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్తోనూ భేటీ అయ్యారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. పంజాబ్ సరిహద్దు భద్రతపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!