AP Assembly: ఈనెల 26 వరకు ఏపీ శాసనసభ సమావేశాలు
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. దీనికి సంబంధించిన సంతాప తీర్మానాలను స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో చదివి వినిపించారు. ఆ తర్వాత సభ్యులు సభలో కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ఇటీవల బద్వేలు ఉప ఎన్నికలో విజయం సాధించిన దాసరి సుధ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమెతో ప్రమాణం చేయించారు.
అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. సీఎం జగన్తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. తెదేపా తరఫున ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. తొలుత ఈ ఒక్కరోజే సభ నిర్వహించాలని భావించినప్పటికీ పలు బిల్లులకు ఆమోదం తెలపాల్సిన దృష్ట్యా సమావేశాలను 26 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం