కేంద్ర ప్రభుత్వం అప్పులపై మాట్లాడే హక్కు వారికి లేదు: సోము

రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేంద్ర ప్రభుత్వ అప్పులపై మాట్లాలడే..

Published : 04 Aug 2021 01:39 IST

అమరావతి: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం అప్పులపై మాట్లాడే హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇవాళ దిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, హరిదీప్‌ పూరీని భాజపా నేతలు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చట్టాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్‌ రూ.25 వేల కోట్లు అప్పు చేసిందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆర్‌బీఐ నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్రానికి తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం చేరుకుందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సోము వీర్రాజు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని