AP Cabinet: కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఆర్గానిక్‌ ఫామ్‌ సంస్థలే ఉత్పత్తులను

Published : 16 Sep 2021 13:27 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఆర్గానిక్‌ ఫామ్‌ సంస్థలే ఉత్పత్తులను విక్రయించేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు వీలుగా ఆర్గానిక్‌ ఫార్మింగ్ సర్టిఫికేషన్‌ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఆసరా రెండో విడత నిధుల మంజూరు.. బడులు, ఆస్పత్రులకు సాయం చేసిన దాతల పేర్లు పెట్టే విధానంపై సమావేశంలో చర్చిస్తున్నారు. విశాఖ మన్యంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశముంది. కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు సహా మొత్తం 40 అంశాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే వీలుంది. ఎల్జీ పాలిమర్స్ భూములను వెనక్కి తీసుకునే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని