AP News: పవన్‌ ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు: సజ్జల

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated : 02 Oct 2021 16:12 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలో పవన్‌ సభ నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేల మందితో సభ ఎలా నిర్వహిస్తారు?కరోనా దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే అందరికీ ఆంక్షలు విధిస్తున్నారు. సీఎం కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారు. రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2,200 కోట్లు కేటాయించింది. నవంబర్‌ నుంచి పనులు ప్రారంభమవుతున్నాయి’’ అని అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని