Mekathoti Sucharita: మహిళలపై దాడులను రాజకీయం చేయొద్దు: సుచరిత

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. దిశ చట్టం

Published : 18 Aug 2021 01:39 IST

అమరావతి: మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. దిశ చట్టం తెచ్చాక గతంలో ఉన్న దర్యాప్తు వ్యవధిని గణనీయంగా తగ్గించామని.. ప్రస్తుతం కేవలం 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. ఏడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దిశ చట్టం తీసుకొచ్చాక 2వేలకు పైగా కేసుల్లో ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. ఈ చట్టం కింద ఇప్పటివరకు 180 మంది దోషులకు శిక్ష విధించగా.. వారిలో ముగ్గురుకి ఉరిశిక్ష పడిందన్నారు. దిశ యాప్‌ను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. దిశ చట్టం కింద తీసుకున్న చర్యల వల్ల ఐదు జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్రానికి వచ్చాయన్నారు.

రాష్ట్రంలో మహిళల భద్రతకు సీఎం జగన్ పెద్దపీట వేశారని సుచరిత తెలిపారు. రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడుందని ప్రతిపక్షనేతలు ప్రశ్నించడం సరికాదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. సామాజిక మాధ్యమాలపై పిల్లల ప్రభావం ఏమేరకు ఉందనే విషయాన్ని తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వినియోగించుకోవాలన్నారు. గుంటూరులో బీటెక్‌ యువతి రమ్య హత్యకేసులో ఏడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలుకు ప్రయత్నిస్తామని మంత్రి వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని