AP News: మూడు రాజధానులే..  ముమ్మాటికీ దానికే కట్టుబడి ఉన్నాం: బొత్స

తిరుపతిలో రేపు జరగనున్నది తెదేపా రాజకీయ సభేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Published : 17 Dec 2021 01:48 IST

అమరావతి: తిరుపతిలో రేపు జరగనున్నది తెదేపా రాజకీయ సభేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి ఐకాస పేరుతో పాదయాత్రగా వెళ్లిన వారంతా తెదేపా సానుభూతి పరులేనని ఆయన ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌, వైకాపా విధానమన్నారు. 

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని.. ముమ్మాటికీ దానికి కట్టుబడి ఉన్నామని బొత్స పునరుద్ఘాటించారు. రాయలసీమకు అన్యాయం చేసేందుకు పాదయాత్ర చేపట్టారని ఆక్షేపించారు. మూడు రాజధానుల బిల్లు అంశంపై అందరితో చర్చించి తప్పులు సవరించి మెరుగైన బిల్లును అసెంబ్లీకి తీసుకొస్తామని చెప్పారు. అమరావతే రాజధాని అని ఎన్నికల ముందు తామెప్పుడూ చెప్పలేదని బొత్స అన్నారు. తమ మేనిఫెస్టోలోనూ ఆ విషయం లేదని.. ఉంటే చూపించాలన్నారు. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని