ఒక్క రూపాయికే ఇల్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదు: బొత్స
ఒక్క రూపాయికే పేదలకు ఇళ్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
అమరావతి: ఒక్క రూపాయికే పేదలకు ఇళ్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టిడ్కో ఇళ్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రూ.480 కోట్లు ప్రజాధనం పొదుపు అయ్యాయని, ఇవేవీ ప్రతిపక్షాలు సహించటం లేదని విమర్శించారు. పేదలకు 340 చదరపు అడుగుల ఇళ్లు ఇస్తుంటే పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ప్రయత్నిస్తోందన్నారు. గతంలో షీర్వాల్ టెక్నాలజీ అని హడావుడిగా మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4.54లక్షల ఇళ్లకు ఉత్తర్వులు ఇచ్చి, 3.13లక్షల ఇళ్లు కడతామని.. కేవలం 51,616 ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారని ఆరోపించారు. ఒక్కచోట కూడా రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. 2.62లక్షల ఇళ్లు కట్టించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు. తొలి విడతలో 90వేల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పన కూడా 100 రోజుల్లోనే పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. మిగతా ఇళ్లను మరో 12 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన 240 అడుగుల ఇల్లు.. భవంతా? అని మంత్రి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.