AP News: జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారు: ఏపీ మంత్రి కన్నబాబు
కొన్ని కోట్ల మంది గుండెల్లో పెట్టుకున్న జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి: కొన్ని కోట్ల మంది గుండెల్లో పెట్టుకున్న జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలని గతంలో చంద్రబాబు అడగలేదా? అని ప్రశ్నించారు. ‘‘ఎంపీల రాజీనామా అంటున్న చంద్రబాబుకు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించిన ఘటన గుర్తులేదా. గతంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.వందల కోట్లు పక్కదారి పట్టించేలా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఓటీఎస్ ద్వారా పేదలకు హక్కు కల్పిస్తుంటే చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ విక్రయం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆయన సీఎంగా ఉన్నప్పుడే గోదావరి ఎరువుల ప్లాంట్ను అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ను విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వమే చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమేంటి? పోలవరం ప్రాజెక్టును వైఎస్ ప్రారంభిస్తే ఆయన కుమారుడు జగన్ దానిని పూర్తి చేస్తారు. 1.30లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగం ప్రబలిపోయిందని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. ఇప్పటితో పోల్చితే తెదేపా హయాంలో 5శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు ఇచ్చినా దాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కల్యాణ్ దీక్ష చేస్తే మంచిదే. దానికి బదులు మోదీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేస్తే ఇంకా మంచిది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంట్ను విక్రయించకూడదనే చెబుతోంది’’ అని కన్నబాబు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్