AP Politics: తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి: అచ్చెన్నాయుడు
ఏపీలో వైకాపా రెండేళ్ల పాలనలో తెదేపా శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ
అమరావతి: ఏపీలో వైకాపా రెండేళ్ల పాలనలో తెదేపా శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కొందరు పోలీసుల వ్యవహారశైలి శృతి మించుతోందన్నారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు తెదేపా కార్యకర్త అంజిపై కడప జిల్లా చిన్నమండెం పోలీసులు అక్రమ కేసులు పెట్టడంతో పాటు కొట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
కండ్రికలో వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్తలపై దాడి చేస్తే బాధితులనే ఇబ్బంది పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టిన పోలీసు అధికారి పేర్లను రాసుకుంటున్నాం. భవిష్యత్లో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరి తీరు పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోంది. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకొని చట్టం ప్రకారం నడుచుకోవాలి’’ అని అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Pratik Doshi: నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ ఎవరో తెలుసా?
-
General News
viveka Murder case: వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్ నిరాకరణ
-
Politics News
Chandrababu: కేసుల నుంచి జగన్ బయటపడేందుకే పూజలు, యాగాలు..: చంద్రబాబు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Bloody Daddy Review: రివ్యూ: బ్లడీ డాడీ.. షాహిద్ కపూర్ సినిమా ఎలా ఉందంటే?
-
Politics News
Bandi sanjay: అందుకే ఈనెల 15న ఖమ్మంలో అమిత్షా సభ: బండి సంజయ్