AP News: ఆ ఆడియో టేపులపై విచారణ అవసరం: వాసిరెడ్డి పద్మ
ఏపీలో ఇటీవల పలువురు అధికార పార్టీ నేతలకు సంబంధించినవిగా పేర్కొంటున్న ఆడియో టేపులపై విచారణ అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆడియో టేపుల్లోని మాటలు తమవి కావని
అమరావతి: ఏపీలో ఇటీవల పలువురు అధికార పార్టీ నేతలకు సంబంధించినవిగా పేర్కొంటున్న ఆడియో టేపులపై విచారణ అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆడియో టేపుల్లోని మాటలు తమవి కావని నేతలు అంటున్నారని.. ఈ వ్యవహారంపై వారిని విచారణ కోరతామన్నారు. మహిళా కమిషన్ తరఫున సమాచారం తెప్పించుకుంటామని తెలిపారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని పద్మ స్పష్టం చేశారు. మరో వైపు ఇటీవల గుంటూరులో నడిరోడ్డుపై హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై కూడా ఆమె స్పందించారు. ఘటనపై తెదేపా 21 రోజుల డెడ్లైన్ సరికాదన్నారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.