ayyannapatrudu: అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: అయ్యన్నపాత్రుడు

ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Published : 19 Sep 2021 01:18 IST

 

నర్సీపట్నం: ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని ఆయన విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ‘‘గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పు చూసి వైకాపా నేతలకు భయం పట్టుకుంది. వైకాపా బెదిరింపులకు మేం భయపడం. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని