Huzurabad bypoll: హుజూరాబాద్‌ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా: బల్మూరి వెంకట్‌

హుజూరాబాద్‌ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధినాయకత్వానికి బల్మూరి వెంకట్‌ నర్సింగ్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి

Published : 03 Oct 2021 01:13 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధినాయకత్వానికి బల్మూరి వెంకట్‌ నర్సింగ్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ లో పాల్గొన్న వెంకట్‌ పోలీసుల తోపులాటలో స్పృహ కోల్పోయి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

2015లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తాను మరోసారి 2018లో రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కావడంలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక పాత్ర పోషించారని వివరించారు. ఎన్‌ఎస్‌యూఐ ఎన్నికల ప్రక్రియ వల్లనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనలాంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి ఎదిగానని వివరించారు. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని తెలిపారు. హుజూరాబాద్‌ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తానని వెంకట్ ధీమా వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని