Ts News: హైకోర్టులో బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్లో
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. తన రిమాండ్ను రద్దు చేయాలని.. తనను విడుదల చేసేలా జైలు అధికారులను ఆదేశించాలని సంజయ్ కోరారు. తనపై ఉన్న ఐపీసీ 333 సెక్షన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలన్న సంజయ్ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు బండి సంజయ్ పిటిషన్.. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్లో విచారణకు వచ్చింది. రోస్టర్ ప్రకారం పిటిషన్ తన పరిధిలోకి రాదని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తెలిపింది. ప్రజాప్రతినిధుల కేసు కావున సంబంధిత బెంచ్కు పంపాలని రిజిస్ట్రీకి సూచించింది. కాసేపట్లో పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!