Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు పేరు ఖరారు
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు.
ప్రకటించిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన పాదయాత్ర పేరును భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రులు బాబూమోహన్, చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ యాత్ర’గా నామకరణం చేసినట్లు రాజాసింగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మార్పు తీసుకురావడానికే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి భాజపా కార్యకర్త దీనిలో పాల్గొంటారన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
2023 వరకు విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుందని రాజాసింగ్ చెప్పారు. తొలి దశలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకు చేపడతామన్నారు. పాదయాత్ర విజయవంతానికి 29 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో అధికార తెరాసకు అసలైన ప్రత్యర్థి భాజపానేనని.. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా