Ts politics: ఈ నెల 28 నుంచి బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం..

Updated : 23 Aug 2021 04:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈనెల 24 నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ మరణం వల్ల  వాయిదా పడింది. పార్టీ పరంగా 3 రోజుల పాటు సంతాపదినాలు పాటించాలని భాజపా అధిష్టానం ప్రకటించింది. ఈనేపథ్యంలో ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని