Ts News: ‘దళితబంధు’ నిలిపివేత.. కేసీఆర్‌ వైఫల్యమే కారణం: బండి సంజయ్‌

రాష్ట్రంలోని దళితులను మరోసారి మోసం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం...

Updated : 24 Sep 2022 16:09 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని దళితులను మరోసారి మోసం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం నిలిపివేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యమే కారణమన్నారు. ఈ పథకం అమలును నిలిపివేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి అవకాశం కల్పించేలా కేసీఆర్‌ వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ ఈ పథకాన్ని నిలిపివేస్తోందని తెలిసే ఇవాళ సమావేశం నిర్వహించి దళితబంధుపై చిలుక పలుకులు పలికారని పేర్కొన్నారు. కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కమిషన్‌ ఎప్పుడూ నిలిపివేయదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని