AP News: జగన్, చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్‌

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

Updated : 03 Oct 2021 15:41 IST

కడప: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. జగన్ పార్టీకి భయపడాల్సిన పని లేదని చెప్పారు. కడపలో భాజపా జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని భాజపా ప్రోత్సహించదు. బద్వేలు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. ఏడేళ్లుగా నిధులిచ్చి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల అభివృద్ధిపై చర్చించడానికి భాజపా సిద్ధం. జగన్, చంద్రబాబుకు చర్చించడానికి సిద్ధమా?’’ అని సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో భాజపా ముఖ్య నేతలు సీఎం రమేశ్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని