Ts News: సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లోనే దాడులు: రఘునందన్‌రావు

రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై తెరాస కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా...

Updated : 24 Sep 2022 15:28 IST

హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై తెరాస కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.  ఈ దాడులు పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని మండిపడ్డారు.  రైతుల దగ్గరికి భాజపా నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని వెల్లడించారు. తెరాస వైఫల్యాల పై రైతులు, ప్రజలు, భాజపా కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గర్లనే ఉందని వ్యాఖ్యానించారు. రైతులను మోసం చేసిన కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లిస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని