TS News: ఈటలను పరామర్శించిన రఘునందన్‌, రాజాసింగ్‌

జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, భాజపా నేత

Updated : 01 Aug 2021 13:27 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ను భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌ పరామర్శించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రేపు ఆయన డిశ్చార్జ్‌ అవుతారని రాజాసింగ్‌ తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించేందుకు ఈటల సిద్ధమవుతున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఆయన ఏడోసారి మళ్లీ గెలుస్తారని భాజపా ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని