Viveka murder case: వైఎస్‌ వివేకాను హత్య చేసినవారు జగన్‌కు తెలుసు: బీటెక్‌ రవి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి కచ్చితంగా తెలుసునని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు

Published : 03 Aug 2021 15:08 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి కచ్చితంగా తెలుసని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన రవి.. వివేకా హత్యకేసుపై స్పందించారు. ‘‘వివేకా హత్య కేసులో నిందితులను తప్పించేందుకు సీఎం జగన్‌ ప్రణాళిక వేశారు. గతంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇప్పుడు సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ దర్యాప్తు నుంచి తప్పుకున్నారు. ఈ రెండు అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు నిందితులను తప్పించేందుకు సీఎం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు