Amarinder Singh: అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్సింగ్ భేటీ.. భాజపాలో చేరేందుకేనా..?
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
దిల్లీ: మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేసిన అనంతరం అమరీందర్ సింగ్ దిల్లీ చేరుకోవడంతో ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పంజాబ్లో ఓవైపు కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ దిల్లీ పయనమయ్యారు. దీంతో ఆయన భాజపాలో చేరతారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ వ్యక్తిగతంగానే దిల్లీకి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తనకు కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిందని తన సన్నిహితుల వద్ద అమరీందర్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన భాజపాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరీందర్ సింగ్ భాజపాలో చేరితే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు వ్యవసాయశాఖను అప్పగించాలని కమలనాథులు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయనను భాజపా సీనియర్ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హోంమంత్రి అమిత్ షా నివాసంలో అమరీందర్ సింగ్ సమావేశమయ్యారు. అనంతరం భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ కెప్టెన్ అమరీందర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత పంజాబ్లో రాజకీయ సమీకరణాలు వెనువెంటనే మారుతున్నాయి. అమరీందర్ స్థానంలో సీఎంగా చరణ్జిత్సింగ్ చన్నీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేబినెట్ విస్తరణ జరిగిన కొన్ని గంటలకే కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ కూడా పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు సంఘీభావంగా ఓ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మద్దతు నిలిచారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తుండడాన్ని కెప్టెన్ అమరీందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా సిద్ధూ ఓ అస్థిరమైన, ప్రమాదకరమైన వ్యక్తి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్తో సుదీర్ఘ సరిహద్దు కలిగిన పంజాబ్ చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రమని.. అటువంటప్పుడు సిద్ధూ వంటి నేతలతో దేశ భద్రతకు ముప్పేనని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది. -
ఆ మూడు స్థానాల్లో భాజపా అభ్యర్థులకు ఓట్లేయొద్దు
లోక్సభ ఎన్నికల్లో తమ వర్గానికి భాజపా టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్ప్రదేశ్లోని రాజ్పూత్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.