Kishan Reddy: లక్ష్య సాధనకు మందకృష్ణ మాదిగ నిరంతర కృషి: కిషన్రెడ్డి
ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల స్నానాలగదిలో జారి పడి.. చికిత్స తీసుకొని కోలుకుంటున్న మందకృష్ణను పరామర్శించిన ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం మందకృష్ణ అనేక ఉద్యమాలు చేశారని కిషన్రెడ్డి చెప్పారు. త్వరగా కోలుకొని లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న సమయంలో కిషన్రెడ్డి సోదరుడిగా గొప్ప పాత్ర పోషించి తన బాధ్యత తీసుకున్నారన్నారు.
అనేక కారణాలతో ఎస్సీ వర్గీకరణ పెండింగ్లో ఉన్నప్పటికీ తమ మధ్య మంచి సంబంధమే ఉందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం శాసనసభలో మాట్లాడుతూ రెండు రోజుల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ పని చేయాలని మందకృష్ణ కోరారు. రెండేళ్ల లోపు ‘దళిత బంధు’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం మందికి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు