Ap News: జగన్‌ ఎన్డీయేలో చేరాలని కోరుతున్నా: కేంద్రమంత్రి అథవాలే

మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని..

Updated : 18 Oct 2021 15:42 IST

విశాఖ‌: మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని.. తను ఎన్డీఏలో చేరాలని కోరారు. ఎన్డీయేలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని.. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామన్నారు. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్‌ పార్టీ పుంజుకునే అవకాశం లేదన్నారు. పీవోకే.. భారత్‌లో అంతర్భాగం అన్న కేంద్ర మంత్రి..  పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పీవోకే వదిలి వెళ్లాలన్నారు.  పీవోకే వీడితేనే భారత్‌-పాక్‌ మధ్య స్నేహం కొనసాగుతుందని అథవాలే అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని