Ts News: సీఎం కేసీఆర్ ఆ ఆలోచన విరమించుకోవాలి.. లేదా ఉద్యమం తప్పదు: చాడ వెంకట్రెడ్డి
టీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. కార్మికులను ఉద్దేశించి నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకపోతే ప్రైవేటీకరిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రైవేట్పరం చేయడానికి అడుగులు వేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని లాభాలతో నడిపిస్తున్నారని.. తెలంగాణలో విలీనం చేయకుండా ప్రైవేటీకరిస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకరావడానికి అనేక మార్గాలున్నాయన్నారు. డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తే కొంతమేర ఉపశమనం కలుగుతుందని సూచించారు. ప్రజారవాణా వ్యవస్థను మెరుగు పరిచి, ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చాడ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ