AP News: జగన్ ప్రోద్బలంతోనే తిక్కారెడ్డిపై హత్యాయత్నం: చంద్రబాబు
సీఎం జగన్ ప్రోద్బలంతోనే కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా ఇన్ఛార్జి తిక్కారెడ్డిపై వైకాపా మూకలు హత్యాయత్నం చేశాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు
అమరావతి: సీఎం జగన్ ప్రోద్బలంతోనే కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా ఇన్ఛార్జి తిక్కారెడ్డిపై వైకాపా మూకలు హత్యాయత్నం చేశాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రెండు సార్లు హత్యాయత్నం జరిగినా తిక్కారెడ్డికి ఎందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. పట్టపగలు దాడులు చేస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడలేకపోతే డీజీపీ రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. మావాళ్లు తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు. దేవుడి సన్నిధిలో కూడా వైకాపా నేతలు హత్యా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. దాడులు చేస్తున్న వైకాపా మూకలు మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ప్రజలే తిరగబడి వైకాపా నేతలకు బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి తిక్కారెడ్డికి రక్షణ కల్పించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్