AP News: జగన్‌ ప్రోద్బలంతోనే తిక్కారెడ్డిపై హత్యాయత్నం: చంద్రబాబు

సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా ఇన్‌ఛార్జి తిక్కారెడ్డిపై వైకాపా మూకలు హత్యాయత్నం చేశాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు

Updated : 12 Dec 2021 04:42 IST

అమరావతి: సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా ఇన్‌ఛార్జి తిక్కారెడ్డిపై వైకాపా మూకలు హత్యాయత్నం చేశాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రెండు సార్లు హత్యాయత్నం జరిగినా తిక్కారెడ్డికి ఎందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. పట్టపగలు దాడులు చేస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడలేకపోతే డీజీపీ రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. మావాళ్లు తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు. దేవుడి సన్నిధిలో కూడా వైకాపా నేతలు హత్యా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. దాడులు చేస్తున్న వైకాపా మూకలు మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ప్రజలే తిరగబడి వైకాపా నేతలకు బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి తిక్కారెడ్డికి రక్షణ కల్పించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని