Chandrababu: కుప్పంలో మున్సిపల్‌ పోలింగ్‌.. పర్యవేక్షణకు చంద్రబాబు 

కుప్పం మున్సిపాలిటీ పోలింగ్‌ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

Updated : 15 Nov 2021 12:21 IST

అమరావతి: కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దొంగ ఓట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్రమాలపై ఆధారాలు సేకరించి వీడియోలు బయటపెట్టాలని సూచించారు. పోలింగ్‌ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా శ్రేణులు పని చేయాలని తెలిపారు. మరోవైపు చంద్రబాబు కాసేపట్లో కుప్పం వెళ్లనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సరళిని ఆయన పర్యవేక్షించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని