Ap News: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు

Updated : 21 Oct 2021 10:02 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖలు రాశారు. రాష్ట్రంలోని విపక్ష నేతలకు, కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వైకాపా దాడులు, ప్రభుత్వ పనితీరు, గంజాయి, డ్రగ్స్‌ రవాణాకు సంబంధించిన పలు అంశాలను లేఖలో వివరించారు. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్పింగులను లేఖలకు జత చేసి పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని