CBN: జాతీయోద్యమ స్ఫూర్తితో పోరాడాలి: చంద్రబాబు

దేశమంతా ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్ర్య ఉద్యమ

Updated : 15 Aug 2021 20:54 IST

హైదరాబాద్‌: దేశమంతా ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్ర్య ఉద్యమ క్షణాలను స్మరణకు తెచ్చుకోవడం గర్వంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆయన ఎగురువేశారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అణచివేత నుంచి బయటపడి స్వేచ్ఛగా ఎదగడం కోసమే ఆనాడు మన నేతలు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు. ప్రజల భావాలకు, ఎదుగుదలకు అడుగడుగునా సంకెళ్లు పడుతుంటే మహనీయుల త్యాగాలకు అర్థమేముందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయోద్యమ స్ఫూర్తితో పోరాడి సమాజాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని