Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే?

ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానిని కోరారు.

Updated : 19 Oct 2021 13:47 IST

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానిని కోరారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని.. సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయన్నారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. బీసీ జనగణనపై తెదేపా ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివని లేఖలో ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని