TS News: తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపు: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 04 Oct 2021 12:50 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో నిరాదరణకు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 160 కి.మీ. మేర గోదావరి సజీవంగా పారుతోందని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన స్పష్టం చేశారు. తమ ప్రాంతాల్లో పర్యాటక, ప్రాచూర్యం పొందిన ప్రాంతాలు ఉంటే ఎమ్మెల్యేలు నివేదిక ఇవ్వాలని కోరారు.

తెలంగాణలో అద్భుతమైన అటవీ సంపద, జలపాతాలు ఉన్నాయన్న కేసీఆర్‌.. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ చరిత్ర, సంప్రదాయాలు, గొప్ప కళల ప్రాంతం. 58 ఏళ్ల సమైఖ్య పాలనలో తెలంగాణ నిరాదరణకు గురైంది. తెలంగాణను పట్టించుకోలేదు.. ప్రోత్సహించలేదు. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదు. తెలంగాణలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు’’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని