CM KCR: తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. హైటెక్స్‌లో జరుగుతున్న

Updated : 24 Sep 2022 14:24 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. హైటెక్స్‌లో జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీలో ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి.. కేసీఆర్‌ ఎన్నికను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తున్నారు. తెరాస ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని