Rotational CM: ఛత్తీస్గఢ్లో నాయకత్వ మార్పు ఉంటుందా?
ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి మార్పుపై చర్చ నడుస్తోన్న సమయంలో సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియా దిల్లీ పర్యటన చేపట్టారు.
ముఖ్యమంత్రి పీఠంపై దిల్లీకి చేరిన కాంగ్రెస్ నేతలు
(2018లో రాహుల్ గాంధీతో భూపేశ్ బఘేల్, టీఎస్ సింగ్ డియో)
ఛత్తీస్గఢ్: గతకొంత కాలంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గిపోతోందని వార్తలు వస్తోన్న సమయంలోనే.. అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లోనూ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్లో అధికారాన్ని కోల్పోగా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ని అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. ఎలాగోలా వాటిని పరిష్కరించుకుంటూ వస్తోన్న కాంగ్రెస్ అధిష్ఠానానికి.. తాజాగా ఛత్తీస్గఢ్లో రొటేషన్ ఫార్ములాలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలంటూ ఓ మంత్రి డిమాండ్ చేయడం ఆ రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలకు కారణమయ్యింది. దీంతో ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్సింగ్ డియో వ్యవహారం దిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి పీఠంపై వాదన వినిపించేందుకు ఇరువురు నాయకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
అధిష్ఠానం వద్దకు ఇద్దరు నేతలు..
ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి మార్పుపై చర్చ నడుస్తోన్న సమయంలో సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియా దిల్లీ పర్యటన చేపట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు వీలైతే కాంగ్రెస్ అధ్యక్షురాలిని కలిసి తమ వాదన వినిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేడు రాహుల్ గాంధీని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఛత్తీస్గఢ్ సీఎం విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రస్తుతానికి నిర్ణయమేమీ తీసుకోనప్పటికీ.. అక్కడ నెలకొన్న విబేధాలపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రొటేషనల్ ఫార్ములాలో సీఎం..
ఛత్తీస్గఢ్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమి చెందింది. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఛత్తీస్గఢ్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం తలనొప్పిగా మారింది. దీనిపై ఓవైపు భూపేశ్ బఘేల్, మరోవైపు సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. చివరకు ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం.. రొటేషనల్ ఫార్ములాలో ఇద్దర్నీ సీఎంగా చేసేందుకు అంగీకరించింది. తొలి రెండున్నర ఏళ్లు భూపేశ్ బఘేల్ను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సూచించింది. అందుకు అనుగుణంగానే అధికార పగ్గాలు చేపట్టిన భూపేశ్ బఘేల్.. ఈ ఏడాది జూన్ 17 నాటికి 2.5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో ముందస్తుగా అనుకున్న ప్రకారం, డియోకు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి.
సీఎం కాకుంటే డియో పార్టీని వీడుతారా..?
భూపేశ్ బఘేల్ సీఎం బాధ్యతలు తనకు అప్పగించి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని టీఎస్ సింగ్ డియో తన సన్నిహితులతో పేర్కొంటున్నారు. ఒకవేళ ఆయనకు సీఎం పదవి ఇవ్వకుంటే టీఎస్ సింగ్ డియో కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. వేరే పార్టీలో మాత్రం చేరే ఉద్దేశం లేనప్పటికీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ బఘేల్ నాయకత్వంలో పనిచేసేది లేదని నిర్ణయించుకున్నట్లు డియో సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో బఘేల్ రాజీనామా చేస్తారని.. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు కుట్ర పన్నుతున్నారనే కోణంలో ఓ వెబ్సైట్లో వార్త రావడం కలకలం రేపింది. ఆ వార్తలను ఖండించిన డియో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నాయకత్వ మార్పుపై సీఎం భూపేశ్ను ఎవరు అడిగినా.. అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం బాధ్యతల నుంచి తప్పుకుంటానని పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై ఇరువురు నాయకులు దిల్లీ చేరుకోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఛత్తీస్గఢ్ సంక్షోభంపై ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది. -
ఆ మూడు స్థానాల్లో భాజపా అభ్యర్థులకు ఓట్లేయొద్దు
లోక్సభ ఎన్నికల్లో తమ వర్గానికి భాజపా టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్ప్రదేశ్లోని రాజ్పూత్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
కూటముల పోరు.. కలిసొచ్చేది ఎవరికి?
సార్వత్రిక ఎన్నికల సమరాన తమిళనాడులో చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధాన పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా కూటముల మధ్యే నెలకొంది. -
తొలిదశకు ముగిసిన ప్రచారం
సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’