ఫోన్ ట్యాపింగ్లు దారుణం: మల్లు రవి
శాంతియుత నిరసనలు చేస్తుంటే అరెస్టులు చేయడం అన్యాయమని టీపీసీసీ సీనియర్
హైదరాబాద్: శాంతియుత నిరసనలు చేస్తుంటే అరెస్టులు చేయడం అన్యాయమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంతో పాటు గోప్యతను బట్టబయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్లు చేయడం దారుణమన్నారు. ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో ఇటీవల నిరసన తెలియజేస్తే.. అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని.. పాలకులు హరిస్తుండటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఇందిరా పార్కు వద్ద ఇవాళ జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని కోరారు. పెగాసస్ వ్యవహారంలో భాగంగా ఏఐసీసీ ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించాలని.. గవర్నర్కు వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద నిరసనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ముఖ్య నాయకులు బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..