Ts Politics : మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్‌ శ్రేణులు

మంత్రి మల్లారెడ్డి ఇంటిని కాంగ్రెస్‌ శ్రేణులు ముట్టడించాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌ ఎస్సీ నేతలు ధర్నా చేపట్టారు.

Updated : 12 Oct 2022 14:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటిని కాంగ్రెస్‌ శ్రేణులు ముట్టడించాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. బోయిన్‌పల్లిలో మల్లారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌ ఎస్సీ నేతలు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మల్లారెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 20 మంది కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు మల్లారెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని