TS News: ట్రబుల్‌ షూటర్‌‌.. ట్రబుల్‌లో పడ్డారు: జగ్గారెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ది నైతిక విజయం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Updated : 14 Dec 2021 16:24 IST

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ది నైతిక విజయం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మెదక్‌లో గెలుపు కోసం జిల్లా నేతలు బాగా పని చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా ఓటు బ్యాంకును కాపాడుకున్నామని చెప్పారు. ఇవాళ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘230 ఓట్లకు ఒక్కటి తగ్గినా రాజీనామా చేస్తానని శపథం చేశా. మాకున్న ఓట్ల కంటే ఏడు ఓట్లు అదనంగా సాధించాం. నా మాటను కాంగ్రెస్ శ్రేణులు ఛాలెంజ్‌గా తీసుకొని పని చేశారు. తెరాస ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌‌.. ట్రబుల్‌లో పడ్డారు. కాంగ్రెస్‌ భయంతో హరీశ్‌రావు క్యాంపులు పెట్టారు. హరీశ్‌ క్యాంపు పెట్టకపోతే.. మా సత్తా చూపించేవాళ్లం. ఇక నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆట మొదలైంది. 2023లో సిద్దిపేట, గజ్వేల్‌ అసెంబ్లీ సీట్లు గెలుస్తాం’’ అని జగ్గారెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు