Didi Vs Congress: దీదీ.. మీరు భాజపా ఏజెంట్ కాదంటే ఆశ్చర్యం వేస్తోంది!
భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం ఏస్తామని చెబుతున్న మమతా బెనర్జీ.. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి మంత్రి పదవి ఎందుకు చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేసింది.
మమతా బెనర్జీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ వల్లే మోదీ శక్తిమంతమయ్యారంటూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం ఏస్తామని చెబుతున్న మమతా బెనర్జీ.. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి మంత్రి పదవి ఎందుకు చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా భాజపా ఏజెంటుగా తృణమూల్ కాంగ్రెస్ పనిచేయడం లేదంటే ఆశ్చర్యం వేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు.. మాటల యుద్ధాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. తాజాగా మూడురోజుల పాటు గోవాలో పర్యటించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ కారణంగానే మోదీ శక్తిమంతమవుతున్నారని విమర్శించారు. రాజకీయాలను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించడం లేదని, ఆ పార్టీ నిర్ణయాలతో దేశం నష్టపోతోందని ఆక్షేపించారు. భాజపాపై తమ పార్టీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ) మాత్రమే పోరాటం చేస్తోందని, దిల్లీ దాదాగిరిని ఇక ఏమాత్రం సహించమని చెప్పారు.
అయితే, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అధీర్ రంజన్ ఛౌదురి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘ప్రస్తుతం భాజపా ఏజెంట్గా పనిచేయడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. గతంలో భాజపా పక్షాన చేరి ఎన్డీఏ కేబినెట్లో భాగస్వామ్యం అయ్యింది ఎవరో గుర్తుతెచ్చుకోండి. అలాంటి మీరు.. ఎల్లప్పుడూ మీకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తారా?’ అంటూ మమతా బెనర్జీకి అధీర్ రంజన్ ఛౌదురి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలహీనమైనదైతే.. పశ్చిమ బెంగాల్లో భాజపాను సమర్థంగా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM