ap news: వైకాపా కౌన్సిలర్‌కి కోపమొచ్చింది.. అజెండా కాపీ చించేశారు

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. వార్డుల్లో చిన్న చిన్న పనులు కూడా కావడంలేదంటూ 24వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ బుస్సెట్టి

Updated : 30 Sep 2021 16:35 IST

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. వార్డుల్లో చిన్న చిన్న పనులు కూడా కావడంలేదంటూ 24వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ బుస్సెట్టి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సచివాలయంలో కూడా తాము చెప్పినట్టు చయేడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నెలా నిర్వహించే కౌన్సిల్‌ సమావేశంలో చెప్పిన పనుల్లో కనీసం కొన్నైనా కానప్పుడు ఈ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. చేతిలో ఉన్న అజెండా కాపీని చించివేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని