Telangana Politics: తెల్లకార్డు ఉన్న వారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయి?: దాసోజు
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇంద్రవెల్లి సభ విజయవంతమైందని.. పెద్ద సంఖ్యలో దళిత, గిరిజన ప్రజలు సభకు తరలివచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇంద్రవెల్లి సభ విజయవంతమైందని.. పెద్ద సంఖ్యలో దళిత, గిరిజన ప్రజలు సభకు తరలివచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ తెలిపారు. ఇంద్రవెల్లి సభతో తెరాసకు చురుకు తగిలిందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొంత మంది ప్రజాప్రతినిధుల విచక్షణ కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరి కాదన్నారు. బుధవారం దాసోజు మీడియాతో మాట్లాడారు.
‘‘కొంత మంది నేతలు నాలుకలు కోస్తామని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు, కటారులు పట్టుకొని తిరుగుతున్నారా? మాకు కత్తులు దొరకవా? మేము నాలుకలు కోయలేమా? రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అవినీతికి పాల్పడిన నేతలు జైలుకు వెళ్లడం ఖాయం. సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. కొంత మంది నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదురు దాడులు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు బియ్యం తెచ్చుకుని తినేవారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయి?రేవంత్ రెడ్డి జైలుకు వెళతారని అంటున్నారు. మీ బాగోతాలు మాకు తెలియవా?మేము బైట పెట్టలేమా?ఏడేళ్లుగా దళిత, గిరిజన ప్రజల నోట్లో మట్టి కొట్టారు. పథకాల పేరుతో ఇవాళ ప్రజలను మభ్య పెడుతున్నారు. సమష్యలపై చర్చించేందు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది’’ అని దాసోజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం