AP News: అవగాహనలేమితోనే సంగం డెయిరీపై విమర్శలు : ధూళిపాళ్ల

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంగం డెయిరీపై చేసిన విమర్శలపై

Updated : 24 Jul 2021 11:33 IST

అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంగం డెయిరీపై చేసిన విమర్శలపై సంస్థ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు. గతంలో డెయిరీ నిర్వహించిన బ్రహ్మనాయుడు సంగం డెయిరీని విమర్శించటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్, ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడారని మండిపడ్డారు. పదవితోనూ వ్యాపారం చేయొచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారని చెప్పారు.

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ఎమ్మెల్యే తనకున్న పనికి రాని భూమిని ప్రభుత్వానికి రూ. 18 కోట్లకు విక్రయించారని ఆరోపించారు. అదే డబ్బుతో సమీపంలో భూములు కొన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వినుకొండ బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే తన పొలాల సమీపానికి మళ్లించారని ధూళిపాళ్ల విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని