
AP News: పరిషత్ ఓట్ల లెక్కింపు పూర్తి.. ఫైనల్ లిస్ట్ ఇదే!
అమరావతి: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కొన్ని జడ్పీటీసీ స్థానాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా లెక్కింపు కొనసాగింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందిన పార్టీల వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 5998 చోట్ల వైకాపా, 826 చోట్ల తెదేపా, 177 చోట్ల జనసేన, 28 చోట్ల భాజపా, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 502 చోట్ల వైకాపా, 6 చోట్ల తెదేపా, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో చోట గెలుపొందారు. జిల్లాల వారీగా వివరాలను కింద చూడొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.