TS News : తెరాస ప్రభుత్వం ఇంకెంతో కాలం ఉండదు : ఈటల

రైతులపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం దుర్మార్గమైన చర్య అని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఇంకెంతో

Updated : 25 Dec 2021 19:49 IST

సిద్దిపేట : రైతులపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం దుర్మార్గమైన చర్య అని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఇంకెంతో కాలం ఉండదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఈటల పర్యటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. ఇల్లు లేని అందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముంపు గ్రామాల్లోని మేజర్లకు రూ.8లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. సాగు భూముల అభివృద్ధికి రైతులకు డబ్బు చెల్లించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని