Eatala Rajendar: గడ్డిపోచలా తీసేశారు.. ఇప్పుడు వాళ్లకు అర్థమైంది: ఈటల
ఎన్ని రకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
హుజూరాబాద్: ఎన్ని రకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారని ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించారని.. గొప్ప మెజారిటీ తనకు అందించారని చెప్పారు. ఏడో సారి ఎమ్మెల్యేగా తనను గెలిచిపించారని.. ఏం చేసినా హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన నేపథ్యంలో హుజూరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. అనేక కుట్రలు, అబద్ధాల ఉత్తరాలు, రూ.వందల కోట్ల ఖర్చు, వందల లారీల మద్యంతో తెరాస ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తనకు ఘన విజయాన్ని అందించారన్నారు. సీఎం కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా ఈటల అభివర్ణించారు.
ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను
‘‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, ఎన్ని జన్మలెత్తినా హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేను. విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతాంగం, కుల సంఘాలు.. ఇలా అందరీ నా విజయానికి తోడ్పాటు అందించారు. కులపరంగా చీలిక తెచ్చారు.. ప్రలోభాలతో ప్రజల్ని ఒత్తిడికి గురిచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ ఏదీ పనిచేయలేదు. తెరాస కుట్రలను ప్రజలు చీల్చి చెండాడారు. ధర్మాన్ని నిలుపుకోవాలని.. ప్రజస్వామ్యాన్ని రక్షించుకోవాలని భావించారు. తమ కళ్ల ముందు ఇన్నేళ్లూ ఉన్న బిడ్డను కాపాడుకోవాలనే వాళ్ల సంకల్పమే నన్ను విజయతీరాలకు చేర్చింది.
భాజపా అక్కున చేర్చుకుంది..
నేను తెరాసకు వెన్నుపోటు పొడిచి వెళ్లినట్లు ఆరోపణలు చేశారు. ఆ పార్టీకి నేను మోసం చేయలేదు.. బయటకు రాలేదు. వాళ్లే వెన్నుపోటు పొడిచి నన్ను బయటకు పంపారు. నా చరిత్ర తెరిచిన పుస్తకం. సూర్యుడిపై ఉమ్మివేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగింది. మొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది భాజపాకి. తెరాస నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ నన్ను అక్కున చేర్చుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా నన్ను దిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. నీ చరిత్ర తెలుసని.. అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సూచనలు, సలహాలు చేశారు. పార్టీకి చెందిన చాలా మంది జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, రాష్ట నేతలు మంచి సహకారం అందించారు. జిల్లా, మండల స్థాయిలో నేతలు ఎప్పటికప్పుడు ముందుండి గొప్పగా నన్ను నడిపించి విజయంలో భాగంగా పంచుకున్నారు. కింది స్థాయిలో ఉన్న భాజపా కార్యకర్తలు పులిబిడ్డల్లా పనిచేశారు.
సోషల్ మీడియా పోస్టులతో చైతన్యం చేశారు
నియోజకవర్గ ప్రజలను నిత్యం చైతన్యవంతులను చేసే ప్రక్రియలో ఎంతో మంది ఉద్యోగులు, ఆర్ఎంపీలు, మహిళా సంఘాలు, ప్రైవేటు టీచర్లు, కవులు, కళాకారులు పనిచేశారు. ఈ యుద్ధం ఈటల రాజేందర్ది మాత్రమే కాదని అంతా భావించారు. సర్వే సంస్థలు కూడా ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ అందించి ముందుకు నడిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక విద్యార్థి సంఘాల నేతలు పనిచేశారు. కేసీఆర్ దుర్మార్గాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తెలియజెప్పారు. సోషల్ మీడియా పోస్టులతో ప్రజల్ని చైతన్యం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగువాళ్లు హుజూరాబాద్ ఫలితం కోసం ఎదురు చూశారు.
తెరాస చేసిన ఒత్తిడికి నాకు ఒక్క ఓటూ పడకూడదు.. కానీ..
నా బొమ్మ, నా గుర్తు, నా పార్టీ జెండాతో ఈటల గెలిచాడని కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడి నన్ను గడ్డిపోచలా తీసేశారు. ఇప్పుడు వాళ్లకి అర్థమైంది.. ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచారో! ఇన్ని నిర్బంధాలు, రూ.వందల కోట్లు ఖర్చు చేసినా ప్రజలు తెరాసను బొంద పెట్టారు. ఉప ఎన్నిక కోసం అధికార యంత్రాంగం గత 6నెలలుగా పనిచేసింది. రూ.10లక్షలకు అమ్ముడుపోతామా? రూ.10లక్షలు పదిసార్లు ఇచ్చినా మారబోమని దళిత బస్తీల్లోని ప్రజలు చెప్పారు. ప్రజలకు తెరాస చేసిన ఒత్తిడికి నాకు ఒక్క ఓటు కూడా పడకూడదు. అంతలా ఒత్తిడికి గురిచేసినా ప్రజలు తన్ని తరిమేశారు. ప్రజలే ఎక్కడికక్కడ సంఘటితంగా మారి నన్ను గెలిపించారు.
వాళ్లకి సవాల్ చేస్తే పిలగాన్ని పోటీకి నిలబెట్టారు..
భాజపాకు ఓటేస్తే పెన్షన్ పోతుందని వృద్ధులను బెదిరించారు. దళితబంధు కూడా ఆపేస్తామని భయపెట్టారు. నా సభలకు ప్రజలకు రాకుండా డబ్బులు ఇచ్చి ఆపే ప్రయత్నం చేశారు. కుట్రదారులు ఎప్పుడూ కుట్రలతోనే నాశనం అవుతారు. నాపై పోటీకి రావాలని కేసీఆర్, హరీశ్రావుకు సవాల్ చేస్తే రాకపోగా పిలగాన్ని నిలబెట్టారు. రెండు గుంటలు ఉన్న వ్యక్తి ఇన్ని రూ.కోట్లు ఎలా ఖర్చు చేశాడు? గతంలో నేను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చాను.. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తా. ఈ పదవి నా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు.. ప్రజలిచ్చింది. మరోసారి నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. హుజూరాబాద్ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతా. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తా. హుజూరాబాద్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’’ అని ఈటల అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్.. లెక్కపెట్టుకోండి
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
భారాస, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే
‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. భారాస.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
కుప్పంలో చంద్రబాబు నామినేషన్
కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి పాశుపతాస్త్రం
తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నామినేషన్
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
తొలిదశ పోలింగ్ 62.37%
దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. -
అధికార దాహం తీరకే శాపనార్థాలు
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారాస నేతలు ఇంకా అధికార దాహం తీరక ఈ ప్రభుత్వం కొనసాగదు, కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?