Ts News: రేపట్నుంచి ఈటల పాదయాత్ర

భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు ఉదయం 9.30 గంటలకు హుజూరాబాద్‌...

Published : 18 Jul 2021 21:31 IST

హుజూరాబాద్‌: ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో భాజపా నేత ఈటల రాజేందర్ తలపెట్టిన పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు ఉదయం 9.30 గంటలకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలం బత్తినవారిపల్లిలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. మొదటి రోజు పాదయాత్రలో నియోజకవర్గంలోని శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని