TS News: హుజూరాబాద్‌లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం: సీఈవో

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందంచి

Updated : 24 Sep 2022 15:13 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందంచి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పరిశీలకులకు స్పష్టం చేసింది. పోలింగ్‌ ఏర్పాట్లపై ఈసీ దిల్లీ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ , పోలీసుశాఖ నోడల్‌ అధికారి జితేందర్‌, కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల పరిశీలకులు సమీక్షకు హాజరయ్యారు.

పోలింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించిన ఈసీ అధికారులు.. శాంతిభద్రతలు, కొవిడ్‌ నిబంధనల అమలుపై ఆరా తీశారు. పోలింగ్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కమిషన్‌.. స్థానికేతరులు ఇంకా ఎక్కడైనా ఉంటే వెంటనే పంపించివేయాలని ఆదేశించింది. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని, పోలింగ్‌ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులు తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులు..  పరిశీలకులను ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఇప్పటి వరకు రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈవో వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఈసీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని