Gangula Kamalakar: గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు సంజయ్ ప్రయత్నం: గంగుల
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడంపై మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడంపై మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని గంగుల అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించే బాధ్యత భాజపా నేతలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కొవిడ్ వ్యాప్తి పెరిగితే ఎవరు బాధ్యులు అని అన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు విధించట్లేదా?అని గంగుల ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. కరీంనగర్ పోలీసులను అభినందిస్తున్నట్లు గంగుల తెలిపారు. సమూహం లేకుండా బండి సంజయ్ దీక్ష చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ది జాగరణ దీక్ష కాదని, కొవిడ్ను వ్యాప్తి చేసే దీక్ష అని విమర్శించారు. ఎవరైనా కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష చేయొచ్చా అని గంగుల అన్నారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. దిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు 317 జీవో ఇచ్చామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM