Hyderabad News: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్ల నిరసన.. ఉద్రిక్తత
నగరంలోని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద భాజపా మెరుపు ధర్నాకు దిగింది.
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద భాజపా మెరుపు ధర్నాకు దిగింది. మేయర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భాజపా కార్పొరేటర్లు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఐదు నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా పనులు జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భాజపా శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.
జనరల్ బాడీ మీటింగ్ జరిగితే మేయర్, తెరాస కార్పొరేటర్ల అవకతవకల బయటపడతాయనే నిర్వహించడం లేదని భాజపా కార్పొరేటర్లు ఆరోపించారు. అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేసి కాంట్రాక్టర్లకు డబ్బులివ్వడంలేదని మండిపడ్డారు. మేయర్ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని భాజపా శ్రేణులు హెచ్చరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్