టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా

Updated : 27 Jul 2021 14:00 IST

ప్రొద్దుటూరు పురపాలక: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పురపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. స్థానిక డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో పోలీసులు ధర్నాను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, భాజపా నేతలు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నాను విరమించుకొని టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించిన భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చాలాసేపు తోపులాట జరిగింది.

అనంతరం అక్కడే బైఠాయించిన భాజపా నేతలను ఆందోళన విరమించాలని డీఎస్పీ కోరారు. వారు ఒప్పుకోకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు స్థానికంగా ఉన్న జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇటీవల భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని